నరసన్నపేట మండలం మడపాం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డు పై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు కోడి గుడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే కారణంగా తెలుస్తుంది. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.