శ్రీకాకుళంలో ఆదివారం, ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. తన స్వగ్రామం నిమ్మాడలో బాలయోగి ఆయనను కలిసి ఎన్యూమరేషన్ పత్రాలను అందించారు. మంత్రి ఓటరు వివరాలను నమోదు చేసి, సంతకం చేశారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో పరిపూర్ణత వస్తుందని, ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.