శ్రీకాకుళం మండలం నీలం జూట్ మిల్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. నరసన్నపేట నుండి శ్రీకాకుళం వైపు వెళుతున్న గ్రానైట్ లారీని వెనుక నుండి మరో లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రానైట్ లారీ క్లీనర్ గ్రానైట్ రాయి మీద పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తిరిగి రావలసి ఉంది.