జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత 10 ఏళ్లుగా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ప్రజల కోసం పనిచేశారని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగేంద్రబాబు తెలిపారు. బుధవారం రాత్రి శ్రీకాకుళంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ గొప్ప ప్రజానాయకుడని కొనియాడిన నాగబాబు, ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో గుర్తింపు తప్పదని ఆశావాదం వ్యక్తం చేశారు.