సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన గొంచర్ల పుణ్యవతి-ధర్మరావు దంపతుల కుమార్తె వాణి, వాలంటీర్ల పొరపాటుతో తల్లికి వందనం పథకానికి అర్హత కోల్పోయింది. ఎనిమిదేళ్ల కిందట మరణించిన సంతోషి బదులుగా వాణి చనిపోయిందని సర్వేలో నమోదు చేశారు. తాజాగా అర్హుల జాబితాలో సంతోషి పేరు రావడంతో విషయం బయటపడింది. అధికారులు తమకు న్యాయం చేయాలని వాణి కోరుతోంది.