సరుబుజ్జిలి: వివాహిత ఆత్మహత్య..

సరుబుజ్జిలి మండలంలోని కూనజమ్మన్నపేట గ్రామానికి చెందిన కూన నీలారాణి (21) అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెంది శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భర్త, రెండేళ్ల కుమార్తె ఉన్న నీలారాణి మృతిపై అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్