శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కొంచాడ గ్రామంలో మంగళవారం ఉదయం కుక్కలు దాడి చేయడంతో 32 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల కాపరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనతో తమకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమదాల వలస నియోజకవర్గంలో ఈ విషాదం చోటుచేసుకుంది.