ఆమదాలవలస: రేపు శైలాడలో ఎరువుల బస్తాల పంపిణీ

ఆమదాలవలస మండలం శైలాడ సచివాలయం వద్ద సోమవారం ఎరువుల బస్తాలను పంపిణీ చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహన్ రావు ఆదివారం తెలిపారు. ఒక ఎకరాకు రెండు యూరియా, ఒక DAP బస్తా ఇస్తామని అన్నారు. కావున ఈ ఎరువుల విక్రయానికి రైతులు ఆధార్ కార్డు, 1బి తీసుకురావాలని కోరారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఎరువుల పంపిణీ జరుగుతుందన్నారు. రైతులు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్