కోటబొమ్మాళి మండలంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని కోటబొమ్మాళి మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం విస్తృతంగా పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లఖందిద్ది గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రతి నెలా ఒకటో తేదీ పేద ప్రజలకు పండుగలా మారిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్