నరసన్నపేటలో గురువారం ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుంది. దీనివల్ల రహదారులపై ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక అవస్థలు పడుతున్నారు. రైతులు తమ పంటలకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.