జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, శనివారం లింగాలపాడు ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం శ్రీకాంత్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. శాంతామణి, అరుణ కుమారి, విజయ్ గౌరీలను సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని సన్మానించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మురళీధర్, శాంతారామ్, గోవిందరావు, విద్యార్థులు పాల్గొన్నారు.