కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని మాయమాటలు చెప్పి గద్దెనెక్కారని జెడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య విమర్శించారు. శుక్రవారం నరసన్నపేటలోని ఒక కళ్యాణ మండపంలో నరసన్నపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.