విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో గ్యారెంటీడ్ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ (జిఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని కొనసాగించాలని ఎంఈఓలు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు తెలిపారు. బుధవారం నరసన్నపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో మమేకమైన వారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో చైతన్యం తీసుకుని వచ్చే దిశగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.