ధనుర్మాసం సందర్భంగా మేలుకొలుపు కార్యక్రమంలో భాగంగా, నరసన్నపేట మండలం దూకులపాడు గ్రామానికి చెందిన తారకరామ భజన మండలి ఆధ్వర్యంలో ఆదివారం జలుమూరు మండలం తిలారు గ్రామంలో నగర సంకీర్తన చేపట్టారు. నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతిరోజు ఒక గ్రామంలో 30 రోజుల పాటు హరి నామ స్మరణతో సంకీర్తనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.