నరసన్నపేట మండల కేంద్రంలో స్థానిక జట్టు కళాసి యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీరామ నవమి ఉత్సవాలలో ఢీ జోడి పండు నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో పలు నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. అయితే, ప్రధాన రహదారిపై ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.