నరసన్నపేట: నియోజకవర్గ సమస్యలను పరిష్కరించండి.. ఎమ్మెల్యే

నరసన్నపేట నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శనివారం అసెంబ్లీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబును కలిసి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా, పలు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ బాబు, సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్