నరసన్నపేట మండలం జమ్మూ పంచాయతీలోని శ్రీ మందాలమ్మ పేరంటాలు తల్లి అమ్మవారి ఆలయంలో 29వ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని అమ్మవారికి అరటి గెలలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు.