శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నరసన్నపేట సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడిస్తూ, మార్చి 23న జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఏడు చోట్ల జరిగిన దొంగతనాలకు సంబంధించి 14 తులాల బంగారం, ఒక పల్సర్ బైక్ను గురువారం సత్యవరం కూడలి వద్ద స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.