రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ తీవ్ర కొరత నెలకొందని, దీనిని పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఎంపీపీ ఆరంగి మురళీధర్ తెలిపారు. సోమవారం నరసన్నపేటలోని పెట్రోల్ బంకు వద్ద వైసీపీ నేతలతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. పెట్రోల్, డీజిల్, ఎరువులు, గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.