పోలాకి: ఖరీఫ్ సాగులో యాజమాన్య పద్ధతులు చేపట్టండి

ఖరీఫ్ లో వరి పంటలో వేసవి దుక్కులు అత్యవసరమని వ్యవసాయ శాఖ ఏడిఎల్ వెంకట మధు తెలిపారు. గురువారం పోలాకి మండలం గొల్లలవలస రైతు భరోసా కేంద్రంలో రైతులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, వేసవిలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. దీనివల్ల అధిక దిగుబడితో పాటు క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్