మరో నెల రోజుల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలలో వైసిపి బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని జెడ్పిటిసి సభ్యుడు ధర్మాన కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. మంగళవారం పోలాకి ఎంపీపీ ఛాంబర్లో సర్పంచులు, ఎంపీటీసీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఎంపీటీసీ ఎన్నికలు కూడా త్వరలోనే రానున్నాయని, వాటిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.