జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని హెచ్ఎం జి శాంతి తెలిపారు. బుధవారం కోడూరు జడ్పీ పాఠశాలలో విజేతలకు సన్మానం చేశారు. పరుగు పందెంలో పాలిన దిలీప్ కుమార్ గోల్డ్ మెడల్, లాంగ్ జంప్ లో డి ఉమామహేశ్వరరావు గోల్డ్ మెడల్ సాధించారు. బి రోహిత్ 800 మీటర్ల పరుగులో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారని ఆమె పేర్కొన్నారు.