మంగళవారం రాత్రి పోలాకి మండలం రాజారాంపురం గ్రామంలో పెద్ద పోలేరమ్మ జాతర మహోత్సవంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో ఎస్సై జి రంజిత్, ఈగల్ టీం సభ్యులు ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే 1972 కు తెలియజేయాలని కోరారు.