పోలాకి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి వివరాలను 'యూడైస్ ప్లస్' పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఎంఆర్సి కార్యాలయంలో సిఆర్ఎంటిసి సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. మండలంలోని అంగన్వాడి కేంద్రాల నుండి ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరిన 152 మంది విద్యార్థుల వివరాలను నమోదు చేయాలని ఆయన తెలిపారు.