జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి వేతనదారులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 322 కోట్లు చెల్లించినట్లు డ్వామా పీడీ లవరాజు తెలిపారు. బుధవారం సాయంత్రం జలుమూరులోని కార్యాలయంలో క్షేత్ర సహాయకులతో జరిగిన సమీక్షలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వేతనదారులకు ఇంకా రూ. 14 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఇప్పటివరకు కోటి 36 లక్షల పని దినాలు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.