సారవకోట మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించినట్లు మండల తెలుగు యువత అధ్యక్షులు పిళ్లా నందకిషోర్ తెలిపారు. బుధవారం తొగిరి గ్రామంలో ఊర చెరువులో ఈ పనులు చేపట్టారు. ఉపాధి వేతనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వేతనదారులకు మంచినీరు, కనీస అవసరాలు ఏర్పాటు చేయాలని ఉపాధి సిబ్బందికి సూచనలు ఇచ్చారు.