భోగాపురం హైవే పై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ప్రమాదంలో మరణించిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మారికవలసకు చెందిన రావాడ ఉదయ్ (29)గా పోలీసులు గుర్తించారు. సింహాచలం గిరిప్రదక్షిణ తర్వాత తిరుగు ప్రయాణంలో బైక్ అదుపుతప్పి విద్యుత్ పోల్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. సీఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.