నరసన్నపేటలో అకాల వర్షం.. చల్లబడిన వాతావరణం

నరసన్నపేట మండలంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో భారీ వర్షం పడడంతో స్థానికులు ఉపసమనం పొందారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వేసవి తాపంతో అల్లాడిన స్థానికులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే రబీ పంటలో ధాన్యం పండించిన రైతులు మాత్రం ఈ వర్షంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్