శ్రీకాకుళం నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న నీటి సరఫరా ఏఈ సత్యనారాయణ, ఆర్ఐ ఉమామహేశ్వరరావులను కమిషనర్ కూర్మరావు సోమవారం సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా వీరిని సస్పెండ్ చేసి పురపాలకశాఖకు సరెండర్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఈ చర్య ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.