ఎల్ ఎన్ పేట మండలం శ్యామలాపురం గ్రామంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం ఇంటింటా తిరిగి నిరుపేద వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు భద్రతా పింఛన్లను నేరుగా అందజేశారు. ఒకటవ తేదీనే పింఛన్లు అందించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని, ఇది ఆనందదాయకమని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఆసరా కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.