సంతబొమ్మాలి మండలం చెట్లతాండ్ర గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు తమ కోరికలు తీర్చాలని స్వామివారికి అరటి గెలలను నివేదించారు. ప్రతి ఏటా ఈ విధంగా అరటి గెలలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు తెలిపారు.