శ్రీకాకుళంలో అనారోగ్య సమస్యలతో మానసిక వేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. టెక్కలి తలగాంనకు చెందిన అనూష(28) సోమవారం అర్ధరాత్రి జుత్తు రంగు ఆయిల్ను తాగి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. కుటుంబీకులు ఆమెను టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్పించగా, మెరుగైన వైద్యానికి శ్రీకాకుళంలోని రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.