విశాఖలో రెండు హోటల్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం

AP: పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడానికి విశాఖపట్నం ప్రాంతంలో రెండు హోటల్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మధురవాడలో శ్రీ దుర్గా కాన్‌దేవ్ ప్రైవేట్ లిమిటెడ్, పద్మ హాస్పిటాలిటీ సంస్థలు రూ.163 కోట్లతో ప్రమోద్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ పేరుతో ఫైవ్-స్టార్ హోటల్ నిర్మించనున్నాయి. అన్నవరంలో క్లబ్ మహీంద్రా బ్రాండ్ కింద శుభ సంకల్ప్ సంస్థ రూ.174 కోట్లతో త్రీ-స్టార్ హోటల్ అభివృద్ధి చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్