AP: విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఒక వ్యక్తి మహిళల బాత్రూంలోకి చొరబడ్డాడు. వారి వీడియోలు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో మహిళలు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతని ఫోన్ను స్వాధీనం చేసుకుని, అతని వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు.