AP: ఏలూరులోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం చోటుచేసుకుంది. ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదని మెంటార్పై ఎంటెక్ విద్యార్థి వినయ్ కత్తితో దాడి చేశాడు. అనంతరం హాస్టల్లోకి వెళ్లిపోయాడు. ఈ దాడిలో అధ్యాపకుడు గోపాల్రాజు తీవ్రంగా గాయపడ్డాడు. కాలేజీ సిబ్బంది మెంటార్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.