AP: ఉపాధి హామీ పథకంలో అక్రమాలపై ప్రశ్నించిన దళితుడిపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం కలగళ్లలో చోటుచేసుకుంది. దళితుడు ఎర్రిస్వామిపై టీడీపీ నేతలు ఈశ్వరయ్య, జయరాం దాడి చేశారు. ఉపాధి పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేస్తున్నారని ఎర్రిస్వామి ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేపట్టారు. అయితే విచారణ అధికారి ముందే దళితుడిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.