AP: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రైతులు నిస్పృహలో కూరుకుపోతుంటే కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని, మొంథా తుఫాన్లో నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందలేదన్నారు.