దేవాదాయశాఖ అధికారి చేతివాటం

కర్నూలు జిల్లా కాల్వబుగ్గ ఆలయంలో దేవాదాయశాఖ అధికారి చేతివాటం చూపించారు. ఈవోగా ఆలయ బాధ్యతలు స్వీకరించగానే బ్యాంకులో పర్సనల్ అకౌంట్ తెరిచాడు. గత ఐదేళ్లుగా ఆలయానికి వచ్చిన నగదు, కానుకలను ఆ ఖాతాకే మళ్లించాడు. ఆ నగదు మొత్తాన్ని ఈవో స్వాహా చేశాడు. రూ. కోటి 30 లక్షల వరకు నగదు మళ్లించినట్లు సమాచారం. వేరే ఆలయానికి బదిలీ అయ్యే సమయంలో బ్యాంక్ అకౌంట్ మూసివేసిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్