AP: కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను మూడు పార్టీలకు తొత్తులుగా మార్చిందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆరోపించారు. ప్రతిపక్షాలనే కాకుండా, సొంత శాఖ అధికారులపై కూడా కేసులు పెట్టి వేధించే దుస్థితికి పోలీసులను దిగజార్చారని ఆమె విమర్శించారు. హోంమంత్రి అనిత లా అండ్ ఆర్డర్ను గాలికొదిలేసి, శాఖలను సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని కళ్యాణి దుయ్యబట్టారు.