AP: మన్యం జిల్లాలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలోని టీచర్ల బాధ్యత తమదేనని, విద్యార్థుల బాధ్యత టీచర్లదేనని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ప్రపంచానికి ఆదర్శంగా మారుతుందని, ఇక్కడి స్వచ్ఛమైన ప్రేమ, అభిమానాలు మరెక్కడా దొరకవని తెలిపారు. విద్యార్థులు మీటింగ్ను పరిపూర్ణంగా నిర్వహించడం అభినందనీయమని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.