విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతం

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో కార్మికుల ఉద్యమం ఉధృతంగా మారింది. 4,200 కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఆ ప్రాంతమంతా నిరసనలు, నినాదాలతో దద్దరిల్లిపోతుంది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ఉద్యోగుల బలిలీలు తక్షణమే నిలుపుదల చేయాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాకినాడ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి యువజన సంఘాలు నిరసన దీక్ష చేపట్టాయి.

సంబంధిత పోస్ట్