AP: ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం సంజీవని ప్రాజెక్ట్ను ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇంటి వద్దనే 42 రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, యూనివర్సల్ హెల్త్, ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్ వంటి పథకాలు కూడా ప్రజలకు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం నొక్కి చెప్పారు.