AP: కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అన్ని పనులు ఏడాదిలోనే పూర్తి చేశామని కాలర్ ఎగరేయడం లేదు. చెయ్యాల్సింది చాలా ఉంది’ అంటూ లోకేశ్ ఎక్స్ లో పోస్టు చేశారు. ‘ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా-పాలన ప్రారంభమై నేటికి ఏడాది. సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం మొదలైంది. ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.