ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు విడతలుగా నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసింది. ఇప్పుడు మూడో విడత పోస్టుల భర్తీ కోసం కసరత్తు చేస్తోంది. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పదవులు ఆశిస్తున్న ప్రతి ఒక్కళ్లు పార్టీ స్ట్రక్చర్ అయిన క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్లో ఉండాలన్నారు. జూన్లోగా 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్టులకు నియామకాలు ఉంటాయన్నారు.