AP: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఉత్తరాంధ్ర జిల్లాలైన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, పొలాల్లో, చెట్ల కింద ఉండొద్దంటూ సూచించారు.