మోహన్బాబు విద్యాసంస్థల బౌన్సర్లు విద్యార్థి సంఘ నేతలను కిడ్నాప్ చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, సీపీఐ రాష్ట్ర నేత రామానాయుడు మాట్లాడుతూ విద్యాబుద్ధులు నేర్పించే ప్రాంగణంలో విద్యార్థులను అదుపు చేయడానికి బౌన్సర్లను ఏర్పాటు చేయడం ఉన్నత విద్యా మండలి నిబంధనలకు, ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధమన్నారు. విద్యార్థి సంఘ నేతల కిడ్నా్పకు ప్రోత్సహించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.