రేణిగుంట చెక్పోస్ట్ సమీపంలో ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. గూడూరు నుంచి తిరుపతికి వచ్చిన కుటుంబం తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. చెక్పోస్ట్ వద్దకు రాగానే ఆటో బోల్తా పడింది. స్థానికులు వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించి, గాయపడిన డ్రైవర్ను రుయా ఆసుపత్రికి తరలించారు.