చంద్రగిరి: ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్నరామాపురం, కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు సంచరించాయి. ఏనుగుల గుంపు ఉందన్న సమాచారంతో రాకేశ్‌ తోటలోకి వెళ్లాడు. ఏనుగులు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. గతంలో రాకేశ్‌ కందులవారిపల్లి ఉపసర్పంచ్‌గా, టీడీపీ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మృతిపై ఎమ్మెల్యే నాని సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్