ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

చంద్రగిరిలో కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పి.సి.రాయులు ఆధ్వర్యంలో.. మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బిజెపి నాయకులు అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళలకు వస్త్ర దానం, అన్నదానం చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శరత్ కుమార్, సుబ్బు యాదవ్, ట్రస్ట్ డైరెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్