ఇది కూటమి ప్రభుత్వమా లేక కూలదోసే ప్రభుత్వమా అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి జీడీ నెల్లూరు నిరసనలో మంగళవారం ఆవేదన చెందారు. తప్పుడు వాగ్దానాలతో పాలనలోకి వచ్చింది కాబట్టే నేడు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించామా అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.